తీర్థయాత్ర?
తీర్థయాత్రలు ఎవరు చేయాలి?
శ్రీ అమరారామం – అమరావతి పంచారామక్షేత్రం
సహస్రాక్షి" శ్రీ రాజరాజేశ్వరీ దేవి ఆలయం - దేవీపురం
శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి - ద్రాక్షారామం
మైసూర్ సమీపంలోని కల్లహల్లి భూవరాహస్వామి ఆలయం
తనోట్‌ మాత ఆలయం (జైసల్మేర్‌)
నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం - కసాపురం
జగజ్జనని ఆలయం కర్నూలు జిల్లా నంద్యాల
జ్ఞాన సరస్వతి దేవాలయం - బాసర
శ్రీ అన్నపూర్ణనేశ్వరి దేవి ఆలయం - హొరనాడు
చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయము - చేబ్రోలు - గుంటూరు జిల్లా
అక్షర గాయత్రీ శ్రీచక్ర పీఠము - రాజమహేంద్రవరం
శ్రీ దత్త క్షేత్రం, జునాగడ్, గుజరాత్
సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం
శ్రీ అన్నపూర్ణనేశ్వరి దేవి ఆలయం - హొరనాడు
శ్రీ దత్తాత్రేయ దేవాలయం - ఎత్తిపోతల
మైసూర్ సమీపంలోని కల్లహల్లి భూవరాహస్వామి ఆలయం
నాగలమడక సుబ్రహ్మణ్య స్వామి
శ్రీ ఐరావతేశ్వర స్వామి ఆలయం - దారశురం - తమిళనాడు
నిష్కలంక్ మహాదేవ్ శివాలయాన్ని దాచి ఉంచే సముద్రం
మందస వాసుదేవ పెరుమాళ్ ఆలయం

తీర్థయాత్ర?

ఇహపరమైన జంజాటం నుంచి బయటపడటానికి మనుషులు తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. కనీసం ఆ సమయంలోనైనా భగవంతుడి మీద మనసు లగ్నం చేయగలనని, చేయాలని ఓ చిరు ఆశ. చింతలు వీడి ఆ దేవదేవుడి చింతన చేసే ప్రయత్నమే తీర్థయాత్ర.

పుణ్యనదుల్లో స్నానం చేయటం, ఆ ప్రాంతాల్లోని ఆలయాలను సందర్శించటమే తీర్థయాత్రల ముఖ్యోద్దేశం. పుణ్యనదుల్లో స్నానాలు, ఆలయ సందర్శనలు మనిషి మనసు మీద ప్రభావం చూపుతాయి. ప్రశాంతతను, స్థిరచిత్తాన్ని కలిగిస్తాయి. మనసును ఆధ్యాత్మికపథం వైపు పయనింపజేస్తాయి.

తీర్థయాత్రకు అసలైన అర్థం మనిషి తనలోకి తాను పయనించడం, తనలోకి తాను చూడగలగటం. బుద్ధిని, మనసును ఆధ్యాత్మిక చేతన, చింతనలోకి ప్రవేశించేటట్లు చేయగలగటం. ఆ స్థితి ఏర్పడిననాడు భగవంతుణ్ని మనలోనే చూడగలం. అలా చూడగలిగిన ప్రతిసారీ ఓ తీర్థయాత్రను పూర్తిచేసినట్లే.

ఆధ్యాత్మిక చింతన మనిషి మనసు నుంచే ప్రారంభం కావాలి. అందుకే మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. నైతిక ప్రవర్తనతో, ధర్మబద్ధమైన జీవితాన్ని సాగించాలి. అప్పుడు ఆ నిర్మలమైన మనసు నుంచి వచ్చే మాట, మనోప్రేరితమై చేసే పనుల్లో ఓ ఏకీభావం ఒనగూడుతుంది.

ఆధ్యాత్మిక_మార్గం లో ప్రయాణం ప్రారంభించిన వ్యక్తికి తాను నమ్ముకున్న మార్గాన్ని మరింత బలపరిచే అనుభవాలు అవసరమవుతాయి.

అటువంటి అనుభవం కోసం కొన్ని ప్రాంతాలను, వ్యక్తులను వెతుక్కుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇలా వెతుక్కుంటూ వెళ్ళటమే తీర్థయాత్ర.

గతంలో ప్రజలు మునీశ్వరుల దగ్గరకు వెళ్ళి తమ సందేహాలను తీర్చుకునేవారు. ఆ మహానుభావులున్న ప్రదేశాలే #పుణ్యక్షేత్రాలు అయ్యాయి.

అటువంటి శక్తి ప్రతిష్ఠించిన దేవతామూర్తుల ద్వారా లభిస్తుంది. ఆ విశేష స్థల పురాణం కలిగిన పుణ్యక్షేత్రాలను దర్శించటం వల్ల మానవుల మనసులో మార్పు వస్తుంది. మారిన మనసు మనిషికి ప్రశాంతతను చేకూరుస్తుంది.

పుణ్యక్షేత్రాల సందర్శన మనస్సుకు ఆహ్లాదాన్ని ఇవ్వడంతో పాటు వ్యాపారాభివృద్ధి, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.